Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వైసిపి మూడేళ్ల పాలనకు కేకు కటింగ్ వేడుక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 30, ( విశ్వం వాయిస్ న్యూస్) ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికి మూడేళ్ళు పూర్తియ్యినందుకు సూచికగా ఆ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వేడుకలను నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరంలోనూ ఈ వేడుకలను నిర్వహించారు. స్థానిక పాత భారతీయ స్టేట్ బ్యాంక్ సమీపంలోని స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ పూల మాలను వేసి నివాళులను అర్పించారు. అనంతరం కేకును కోసి కేకుతో పాటు మిఠాయిలను పార్టీ జనులకు పంచారు. మన రాష్ట్రానికి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటికి మూడు సంవత్సరాలు అయ్యిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండలం ఎంపీపీ పర్వత రాజబాబు, శంఖవరం ఉపసర్పంచ్ చింతమనీడి కుమార్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement