Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గౌతమి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో మండపేట మునిసిపల్ హై స్కూల్స్ లో మొదటి స్థానం సాధించిన శ్రీ గౌతమి మునిసిపల్ హై స్కూల్ విద్యార్ధులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రశంసించారు. మండపేట పట్టణంలో శ్రీ గౌతమీ మునిసిపల్ హైస్కూల్ నుండి హాజరైన విద్యార్ధులు 139 కాగా ఉత్తీర్ణులైన వారు 86 అయ్యారని హెచ్ ఎం తెలిపారు. ఉత్తీర్ణతా శాతం 62%  సాధించారు.అత్యధిక మార్కులు 554/600 (మొదటి స్థానం) దేవరపల్లి వీర వెంకట దుర్గా వైష్ణవి సాధించగా రెండవ స్థానం 544/600 బండారు పవన్ కుమార్, మూడవ స్థానం 543/600బండారు శ్రీతరుణ లు సాధించారు. వారిని ఎమ్మెల్యే దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అత్యధిక మార్కులు రావడానికి కారకులైన  గౌతమీ మునిసిపల్ హైస్కూల్  హెచ్ ఎం సి హెచ్ శోభావళి ఇతర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  సూర్యలత,  పడాల రామచంద్రారెడ్డి ,  వల్లూరి దొరకయ్య ,వారణాసి సత్తిబాబు , తల్లిదండ్రులు దేవరపల్లి వీర వెంకట సత్యనారాయణ, బండారు వెంకట రమణ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement