విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి.అర్.పురం, ( విశ్వం వాయిస్ న్యూస్) 12;-
మండలంలోని రేఖపల్లి గ్రామ శివారులో వన దేవతల గద్దె వద్ద అశేష జనాల మధ్య అంగ రంగ వైభవో పేతంగా నిర్వహిస్తున్న రాజుల కొలుపు జాతరలో బాగంగా ఆదివారం రాజులస్వామి వారిని చిన సారాలమ్మ,పెద్ద సారాలమ్మ అమ్మవార్ల ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డాక్టర్ కూన దయానంద్ దంపతులు,దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికిన రాజుల పూజారి సార పాండు రాజు జాతర కమిటి, అనంతరం వారికి దుశ్శాలువాను కప్పి ప్రత్యేకంగా నాయకపోడు సేవ సంగం జిల్లా కమిటీ వారు ఆహ్వానించారు. జాతర విశిష్టత గురించి కమిటీ వారు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవ సంగం జిల్లా అధ్యక్షులు చిక్కాల బాలు,ప్రధాన కార్యదర్శి కొట్టి కన్నంరాజులు బేతి ఆదినారాయణ (కరెంట్ ఫోర్ మెన్)కొట్టి ముత్యాలరావు, గ్రామ పెద్దలు కొల్లుబోయన రమణయ్య,వీర్ల నాగేశ్వరరావు, జాతర కమిటీ వేతకాని మల్లయ్య ,బేతి నాగేశ్వరరావు, కళ్ళ సత్తి,బేతి రాజు,భేతి తిరుపతిరావు,పట్టీల సీతయ్య,బేతి సారయ్య,తదితరులు పాల్గొన్నారు.