Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 7:31 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 7:31 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 7:31 AM

గుడిమెట్ల సోమిరెడ్డి పేదల పక్షపాతి.. అఖిలపక్ష నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* రంగన్న సైన్యం ఆధ్వర్యంలో రక్తదానం
* గుడిమెట్ల సోమిరెడ్డి జయంతి సందర్భంగా
* సోమిరెడ్డి సేవలు వెలకట్టలేనివి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:

 

పెనుమంట్ర ( విశ్వంవాయిస్ ప్రతినిధి)

మండలంలోని వెలగలేరు గ్రామంలో దివంగత గుడిమెట్ల సోమిరెడ్డి జయంతి సందర్బంగా సోమిరెడ్డి నెలకొల్పిన రంగన్న సైన్యం,అభిమానులచే ఏర్పాటుచేసిన కాకినాడ,రోటరీ క్లబ్ డాక్టర్ పి.కామరాజు నేతృత్వంలో రక్తదాన శిబిరానికి పెనుమంట్ర మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సత్తి విష్ణుకుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ గుడిమెట్ల సోమిరెడ్డి ప్రజా నాయకుడిగా, ఉప సర్పంచ్ గా గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతూ, నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రమైన కృషి చేసిన వారిలో ఒకరిని అన్నారు.అంతేకాక పేదల పట్ల దయ దాక్షిణ్యం చూపిస్తూ, వారి అభివృద్ధి కోసం తన సొంత నిధులను సైతం కేటాయించడం ద్వారా సోమిరెడ్డి త్యాగాన్ని మరువలేమన్నారు. జిల్లా వైసీపీ నాయకులు సత్తి వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదల సహాయం కోసం పరితపించిన సోమిరెడ్డి చూపిన బాటలో రంగన్న సైన్యం,అభిమానులు సంయుక్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్త దాతలుగా ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో వైసీపీ నాయకులు కర్రి సోమిరెడ్డి,గుడిమెట్ల సుబ్బారెడ్డి, రామరెడ్డి,సత్తిరెడ్డి,సతీష్ రెడ్డి,పెచ్చేటి వెంకటేశ్వరరావు,యార్లగడ్డ జేమ్స్,ఉండ్రాజవరపు పాపారావు,గుడిమెట్ల ఆదిత్యమంగారెడ్డి,ఆదిత్యసంతోష్ రెడ్డి, వెలగల కుశకుమార్ రెడ్డి,పురుషోత్తంరెడ్డి,సత్తి సనత్ కుమార్ రెడ్డి,మేడపాటి చిన్న రెడ్డి,నితీష్ రెడ్డి, ద్వారంపూడి విజయషణ్ముఖ రెడ్డి,మండ సత్యనారాయణ రెడ్డి,కొవ్వూరి చంద్ర రెడ్డి,సూరెడ్డి,వాసు రెడ్డి,సత్తి సత్తిరెడ్డి, బీజేపీ నాయకులు గుడిమెట్ల రామకనకరెడ్డి, కాకినాడ రక్తదాన శిబిరం సిబ్బంది ఎం. ప్రభాకరరావు,లోవరాజు,మూర్తి,జగదీష్,భాషలు,పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొనగా ముప్పై మందికి పైగా రక్తదానం చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!