Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వెదిరేశ్వరం సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ నిర్మాణానికి విరాళం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్)

కోనసీమజిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ నిర్మాణానికి మహేంద్రా గ్రూప్ అధినేత కర్రి రామకృష్ణారెడ్డి *లక్ష (1,00,000/-) రూపాయలు* విరాళంగా అందించడం జరిగింది. ఈ విరాళాన్ని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ బండారు సత్యానందరావు చేతులమీదుగా ఈ విరాళాన్ని చర్చి నిర్మాణాకి ఈరోజు అందించడం జరిగింది. వెదిరేశ్వరం యం.పి.టి.సి. గంటా సుబ్బారావు తమ నిధులనుండి చర్చికి బోర్ వేయించడం జరిగింది.

ఈసందర్భంగా బండారుసత్యానందరావు మరియు వెదిరేశ్వరం గ్రామ పెద్దలు, చర్చ్ సంఘ పెద్దలు మాట్లాడుతూ ఆస్తిపాస్తులు, ధనం వున్న వాళ్ళు చాలామంది వుంటారు, కానీ వారిలో దానగుణం వున్న వాళ్ళు కొద్ది మందే వుంటారనీ, అలా దానగుణం వున్నా కానీ వారికి అర్ధంచేసుకొనే కుటుంబం ఉండాలనీ ఆవరుసలో మహేంద్ర రాము ముందుటారని వారు అన్నారు. రాము గారికి ఆప్రభువు దయవల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని వారు ఆకాంక్షించారు. మహేంద్ర రాము మాట్లాడుతూ ఈచర్చి నిర్మాణానికి ఎటువంటి సహాయం కావాలన్నా నేను అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈకార్యక్రమంలో వెదిరేశ్వరం గ్రామ పార్టీ అధ్యక్షుడు సయ్యపరాజు నరసింహరాజు, రాష్ట్ర వాణిజ్య సెల్ ఉపాధ్యక్షుడు సయ్యపరాజు రామకృష్ణంరాజు, రావులపాలెం మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, వెదిరేశ్వరం యం.పి.టి.సి.గంటా సుబ్బారావు, కర్రి రామకృష్ణారెడ్డి, కర్రి వెంకటరెడ్డి, పెనుమాళ్ళ అన్నవరం,గుమ్మడి రాజబాబు, భట్నవిల్లి సత్యనారాయణ, తోరం రవి, గుమ్మడి జాన్, హరీష్, పణీకృష్ణ మొదలగువారు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement