విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
విజయవాడలో నేషనల్ ఫీలన్తరోపిక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉమెన్స్ ఐకాన్ అవార్డ్స్ ప్రధాన ఉత్సవం సందర్భంగా అత్యంత శక్తివంతమైన సేవలకు గాను జాతీయ స్థాయిలో కోనసీమ జిల్లాఅమలాపురం మండలం బండారులంక గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ఎన్నిక చేసిన సందర్భంగా డాక్టర్ అద్దంకి రాజా యోనా మరియు జాతీయ అంతర్జాతీయ కవివర్యులు కత్తిమండ ప్రతాప్ మరియు కమిటీ సభ్యుల సమక్షంలో విజయవాడలో హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్ నందు ప్రశంసా పత్రం మెమెంటో బహూకరించారు కరోనా టైంలో మరియు వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను ప్రజలతో మమేకమైన మహిళగా ధైర్యంగా నిలబడి ప్రజలకు సేవ చేసిన దానికిగాను బహూకరించిరీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళ మణులను గుర్తించి పలువురిని సన్మానించారు .ఈ సందర్భంగా సర్పంచ్ పెనుమల సునీత మాట్లాడుతూ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని,ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మరింత సేవ చేస్తానని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ములపర్తి సత్యనారాయణ కోరుకొండ ప్రభాకర్ దొమ్మేటి రామారావు పెనుమాల ఏడుకొండలు తదితరులుపాల్గొన్నారు