విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్లరేవు పురవీధుల్లో ఉత్సవ విగ్రహాల ఊరేగింపులు
తాళ్లరేవు మండలంలో సీతారాముల నూతన విగ్రహాల ప్రతిష్ట మరియు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల పంచలోహ ఉత్సవ విగ్రహాలను కళ్యాణం ముక్కోటి రామాలయ కమిటీ ఆధ్వర్యంలో పురవీధుల్లో వారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పంచలోహ ఉత్సవ విగ్రహాలను మకర తోరణం పీఠములను మేడిశెట్టి వీర్రాజు దుర్గ భవాని దంపతులు అందజేశారు. అదేవిధంగా కాదా నూకరాజు నాగలక్ష్మి సీతమ్మవారికి మంగళ సూత్రాలు అందజేశారు. అనేక మంది భక్తులు ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.