Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్ళరేవులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

కోరంగి గ్రామంలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్ళరేవులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

 

కోరంగి గ్రామంలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ

 

తాళ్ళరేవు మండలంలోని పలు అభివృద్ధి పనులకు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. కోరంగి గ్రామపంచాయతీ పరిధి సీతారామపురం గ్రామంలో యాదవ సంఘం సామాజిక భవనానికి భూమి పూజ చేశారు. బొడ్డువాని లంక వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు ఒక కోటి 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్డుకు, యాదవ సామాజిక సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అభివృద్ధి పనులను సకాలంలో జరిగించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి బాటలో నడుస్తుందని ప్రజల శ్రేయస్సు కొరకే పాలకులమైన పాటుపడుతున్నామని, అందు నిమిత్తమే ఈ శంకుస్థాపనలు కూడా ప్రారంభించామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తాళ్లరేవుసూర్య గ్లోబల్ మల్టీస్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గాడి మొగ, కోరంగి గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు వీర్రాజు, కనకరాజు లను ఎమ్మెల్యే పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు ఎంపీపీ రాయుడు సునీత, జడ్పిటిసి సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement