విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:
ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఏఎస్ దినేష్ కుమార్ ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్థానిక ఒంగోలులోని ఎన్నారై జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు పరీక్షలు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించి ఏర్పాట్లపై అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నాలుగో తేదీతో పరీక్షలు ముగియనుండటంతో పరీక్ష షెడ్యూల్ ముగిసే అంతవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు