— ఆలయ అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిది
విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:
అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న దాతల సహకారం మరువలేనిది అని పి .గన్నవరం నియోజకర్గం శాసన సభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. బాల బాలాజీ స్వామి వారి సన్నిధిలో అభివృద్ధి పనులలో భాగముగా సుమారు 12 లక్షలు వ్యయంతో నిర్మించబోయే గోకులం , యాగశాల, శయన మందిరం దాతలు చీకట్ల చిన్నయ్య వారి కుటుంబ సభ్యులు,మద్దుల పుల్లేశ్వరరావు , సావిత్రి దంపతులు సహకారం అందిస్తున్నారు. దాతలను ఎం ఎల్ ఏ కొండేటి చిట్టిబాబు,ఆలయ సహాయ కమిషనర్ జి.మాధవి,ధర్మకర్తల మండలి చైర్మన్ ,సభ్యులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిట్టూరి రామకృష్ణ , మరియు దర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు , బత్తుల విజయ గంగారత్నం ,గూటం శ్రీనివాస్ ,కొమ్ముల సూరిబాబు , ఆలయ ఉప ప్రధాన అర్చకులు మద్దాలి తిరుమల శింగరాచార్యులు , గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గెడ్డం మంగాలక్ష్మి , వెంకటేశ్వరరావు , ఆలయ అర్చకులు మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.