విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
నగరం పోలీసు స్టేషన్ నూతన ఎస్ ఐ గా పి.సురేష్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.ఈయన ఇంతకు ముందు రాయవరం ఎస్.ఐ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు.ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ఎస్ ఐ జానీ బాషా పామర్రు స్టేషన్ కి బదిలీపై వెళ్ళారు…నూతన ఎస్ ఐ గా భాద్యతలు చేపట్టిన సురేష్ కు సిబ్బంది స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ,నేరాల అదుపులో ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజా ప్రతినిధులు,అధికారులు,ప్రజలు అందర్నీ సమన్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకుంటామని ఆయన చెప్పారు.