ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తోటపేట గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాలలో శాసనసభ్యులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరింది అనే విషయాన్ని శాసనసభ్యులు స్వయంగా ప్రజలకు వివరించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు పరిపాలన గురించి వివరించారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, తాళ్ళరేవు జడ్పిటిసి సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, తోటపేట నాయకులు పి .శ్రీనివాసరావు, ఆర్ భద్రరావు,ఎరికే వీరబాబు,సర్పంచ్ వెంటపల్లి నూకరాజు,ఎంపీటీసీ సభ్యులు,వైఎస్ఆర్సిపి నాయకులు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.