రామచంద్రపురం 2024 అసంబ్లీ ఎలక్షన్ లో బిసిల తరుపున ఎమ్ ఎల్ ఏ అభ్యర్థిని బరిలోకి దింపుతాం
మైనారిటీ బిసిలను గుర్తించిన పార్టీకే మద్దతు
విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
విశ్వం వాయిస్ రామచంద్రపురం
అంబేద్కర్ కోనసీమ జిల్లా
రామచంద్రపురం నియోజకవర్గంలో
మండలం జగన్నాయకుల పాలెంలో జరిగిన మైనార్టీ బీసీ సంఘం సమావేశం జరిగింది ఈసమావేశంలో పలు అంశాలు చర్చించడం జరిగింది.రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ అంటే ఒక కులం కాదు సుమారుగా 23 బీసీ కులాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రామచంద్రపురం నియోజకవర్గంలో మైనారిటీ బీసీల నుండి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ప్రాతినిధ్యం వహించలేదు . ఇప్పటి వరకు ఒక బీసీ కులం ఒక ఓసి కులం మాత్రమే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు కానీ మైనారిటీ బీసీల ఎదుగుదలకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు 2024 ఎన్నికలలో ఏ పార్టీ అయితే మా మైనారిటీ బీసీల గురించి ఆలోచిస్తారో ఆ పార్టీకి సపోర్ట్ చేయడం గానీ,లేదా నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని మా మైనార్టి బీసీ సంఘం నుండి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టుటకై మైనార్టీ బీసీ సంఘం తీర్మానం చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో సంఘం నాయకులు యాట్లనాగేశ్వరరావు, కానీల వీర భధ్రరావు,పోతాబత్తుల విజయ్ కుమార్, కొట్టువాడ హరిబాబు, వేమవరపు రాంబాబు, దాలిపర్తి భీమేశ్వరరావు, రేవాడి త్రిమూర్తులు, పాకలపాటిగోపి,సూధంశెట్టి గంగాధర్, యండమూరి సత్తిబాబు, కొండేపూడి రామకృష్ణ గౌడ్, షావుకారు శివయ్య,గొర్రెల శ్రీను,పీ.శివరామ్, కే.వెంకటేశ్వరరావు,జీ.వీ సోమరాజు,విజయ్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.