విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ ఈరోజు మన హసన్ బాద గ్రామంలో రామచంద్రపురం నియోజక వర్గ కన్వీనర్ పిల్లి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు గురించి వివరించారు.హసన్ బాద గ్రాస్థులు రాజ్య సభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుతూ బోస్ రాజకీయ నైతిక విలువలు కలిగిన నిజాయితీ పరుడైన నాయకులని వారిని కొనియాడారు.గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న వారికి ఈ సందర్బంగా పిల్లి సూర్య ప్రకాష్ ధన్యవాదములు తెలియజేసారు.ఈ సందర్భంగా పిల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల,మత వర్గ ప్రాంతాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.అనంతరం పిల్లి సూర్య ప్రకాష్ గ్రామ సర్పంచ్ వార్డ్ సభ్యులు పంచాయితీ సిబ్బంది,గ్రామస్థులు ఘనంగా సత్కరించారు.గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామమంతా పర్యటించారు.జగన్ అందించిన జగన్ సంక్షేమ బావుటా లబ్ధిపొందిన పథకాలు గురించి వివరిస్తూ,ఇతర సమస్యలు గురుంచి అడిగి తెలుసుకొని అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కార చర్యలు చేపట్టారు.ఈసందర్భంగా గ్రామ ప్రజలు పిల్లి సూర్య ప్రకాష్ కి నీరాజనాలు పలుకుతూ పూలదండలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ యార్ని దేవి,పంచాయితీ సెక్రటరీ భాస్కర లక్ష్మి, వీఆర్వో సూర్యకుమారి,ఉప సర్పంచ్ నీలం భవాని, వార్డ్ సభ్యులు,సచివాలయం, రెవిన్యూ, ఆరోగ్య,అంగన్వాడీ,డ్వాక్రా, ఎంజిఎన్ఆర్ఇజిసి సిబ్బంది,వాలంటీర్స్ వైఎ్సార్సీపీ కన్వీనర్లు,గృహ సారథులు,గ్రామ పెద్దలు గ్రాస్థులు తదితరులు పాల్గొన్నారు.