చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల సందేశం
డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ సూచనలు
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
దీపావళి శుభాకాంక్షలు తెలిపుతూ మండపేట ఎంపిఎస్ పాఠశాల విద్యార్థుల పటాకుల వాడకాన్ని తగ్గించి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి శాంతియుతంగా పండుగని జరుపుకోవాలని సందేశాత్మక చిత్రాల ద్వారా తెలిపారు. రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి పరిచయం చేయాలని, అలాంటి దీపావళి మొదట మనం ఆచరించి, తదుపరి తరాలకు తెలపాలని సందేశమిస్తూ మండపేట పబ్లిక్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ తన విద్యార్థులతో దీపావళి సందర్భంగా వేయించిన చిత్ర లేఖనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని దీపావళి మన పూర్వీకులు ఆచరించారని, లక్ష్మీ పూజలు,పిండి వంటలు, దీపాల వరుసలతో ప్రతి...
వ్యాపార కార్యకలాపాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు
కళ్ళెదుట కనబడుతున్నా కళ్ళు మూసుకుంటున్న యంత్రాంగం
సరఫరాదారులు సిలిండర్ కు అధికంగా వసూలు చేస్తూ, బ్లాక్ లో సరఫరా చేస్తున్నారని విమర్శలు
ప్రమాదంగా మారకముందే మేలుకోవాలని ప్రజల హితవు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దీపం పధకం ద్వారా పేద,మద్య తరగతి ప్రజలు నిత్యం వినియోగించే వంట గ్యాస్ ను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందిస్తూ సహాయ పడుతున్నప్పటికీ, గృహ అవసరాల నిమిత్తం వినియోగించవలిసిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. పేద,...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం
రాయవరం సబ్ స్టేషన్ పరిధిలో రాయవరం 11కెవి టౌన్ 2, మాచవరం ఫీడర్ల పరిధిలో మరమ్మత్తుల నిమిత్తం రాయవరం,మహేంద్రవాడ,మాచవరం గ్రామాలకు అక్టోబర్ 18 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు శుక్రవారం తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పదిమంది కార్మికుల మృతి
అండగా ఉంటామని నాయకుల నోటిమాట, అర్థం కాని కూటమి ప్రభుత్వ పోకడ
శనివారం లోపు పరిహారం ప్రకటించక పోతే, బాధిత కుటుంబాలతో కలిసి ఉద్యమం బాట.
పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్, ఎం.ఆర్.పి.ఎస్., ఎస్.సీ, బీ.సీ, మైనార్టీ ప్రజా సంఘాల హెచ్చరిక
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో శ్రీ గణపతి ఫైర్వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగార కేంద్రంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకమని, ఘటన జరిగి వారం రోజులు గడిచినా నష్టం పరిహారం పై ప్రకటన లేని ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్., ఎం.ఆర్.పి.ఎస్.,...
చిన్న పాటి నిర్లక్ష్యం పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది.
ఇంటి వద్ద దీపావళి సామాగ్రి తయారీ చేసే ఆలోచన వద్దు
జనావాసాల్లో దీపావళి సామాగ్రి నిల్వ, అమ్మకాలను సహించేది లేదు.
ఎంతటి వారైనా నిస్సందేహంగా కేసులు నమోదు చేస్తాం...
ప్రమాదం జరిగాక పొందే ఆవేదన కంటే, ముందుగా మేల్కొనే జాగ్రత్త మేలు.
మండపేట రూరల్ సిఐ పి.దొరరాజు.
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
దీపావళి పండుగ నిమిత్తం మందుగుండు సామాగ్రిని సొంతంగా తయారుచేసే ఆలోచన పెట్టుకోవద్దని ఈ విషయంలో చిన్న పాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించబోమని మండపేట రూరల్ సిఐ పి. దొర రాజు మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ళల్లో దీపావళి బాణాసంచా సామాగ్రి నిల్వ చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, నిస్సందేహంగా...
చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిట్టూరి యామిని,లింగం వెంకట కృష్ణ
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
మండల కేంద్రమైన రాయవరంలో ఇటీవల బాణాసంచా కర్మాగారంలో జరిగిన విస్ఫోటనం లో మృతుల సంఖ్య పదికి చేరింది. సంఘటన లో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం,అనపర్తి సావరం కి చెందిన చిట్టూరి యామిని, కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (చినబాబు) లు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాద తీవ్రత తో ఘటనా స్థలంలోనే నిర్వహకునితో కలిపి ఆరుగురు సజీవదహనం కాగా, గాయపడిన నలుగురు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందడం ఆవేదన కలిగించే విషయం.
కొద్దిపాటి నిల్వలైనా ప్రమాదకరంగా మారవచ్చు
బాణాసంచా అక్రమ నిల్వలు గుర్తిస్తే 112 లేదా 100 కు సమాచారం అందించాలి.
రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయన మీడియా ద్వారా, దీపావళి పండుగ సందర్భంగా, ప్రజల భద్రత దృష్ట్యా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఇళ్ళ వద్ద బాణాసంచా తయారీ లు చేపట్టినా, ఇంట్లో బాణాసంచా నిల్వ చేసినా సమాచారం ఇవ్వాలని , అమ్మకాలు, తయారీకి సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా...
శెట్టి బలిజ సామాజిక వర్గ నేతలతో కలిసి బాధితులకు పరామర్శ
నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి..
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
మద్యం మత్తులో ఆటో డ్రైవర్, ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో బాధితులైన వాసంశెట్టి రామకృష్ణ, అనుసూరి అన్నపూర్ణ తదితరులను మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ మంగళవారం వి.సావరం గ్రామంలో వారి గృహం వద్ద పరామర్శించి,వారిని ధైర్య పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన నిందితుల నేర స్వభావానికి నిదర్శనమని ఇట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినది కాదని, నిందితుల వెనుక ఉన్నది ఎంతటి పెద్ద...
ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశావర్కర్ల నిరసన కార్యక్రమం
ఆరోగ్య కేంద్ర సిబ్బంది కి వినతిపత్రం అందజేత
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశావర్కర్లు గా మార్పు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కోరుతూ,మండల కేంద్రమైన రాయవరంలో గల స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్ల యూనియన్ లీడర్ జి.దుర్గ ఆద్వర్వంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ దుర్గ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని రకాల జాతీయ సెలవులు, పండుగ సెలవులు, వారాంతపు సెలవు, క్యాజువల్ శెలవులు, మెడికల్ శెలవులు వంటివి తమకివ్వాలని, నాణ్యమైన యూనిఫామ్ లు తమకివ్వాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశా లకు...
ఘటన జరిగిన 48 గంటలలోపే కేసును చేధించిన పోలీసులు
చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందనలు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
ప్రయాణికులతో వస్తున్న ఆటోను అడ్డగించి ఆటోడ్రైవర్ , ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో నిందితులైన శాఖా వినయ్ వంశీ, మాచవరపు వెంకట సాయి గణేష్, రిమ్మలపూడి శ్రీ సాయి కృష్ణ, పర్వతిని మౌళి సాయి క్రిష్ణ లను మంగళ వారం అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించినట్లు మండపేట రూరల్ సీఐ దొర రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అక్టోబర్ 06 సోమవారం ఉదయం 3.30 గంటలకు వెదురుపాక సావరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వాసంశెట్టి రామకృష్ణ, తన బందువులైన అనసూరి శ్రీనివాస్...