విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మెకానికల్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ మరియు రీసెర్చ్ కన్సల్టెంట్ దమయంతి జేసుదాస్ కు పిహెచ్.డి అవార్డు ప్రధానం చేయడమైనది. బుధవారం యూనివర్సిటీలో వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు చేతుల మీదుగా పి హెచ్ పి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు)లో “ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ మ్యాపింగ్ ఫర్ పాపులేటింగ్ ఆన్టాలజీస్ ఇన్ ప్రొడక్ట్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్” అనే అంశంపై దమయంతి పరిశోధన చేశారని చెప్పారు.దమయంతి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఫ్యాకల్టీ మెంబర్, కన్సల్టెంట్గా పని చేస్తున్నారని, పరిశోధన ప్రాజెక్ట్లు, స్టూడెంట్ ఇంటర్న్షిప్లు, ఇతర విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పీహెచ్డీ అందుకున్న దమయంతి వీసీ జగన్నాథరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. అశోక్, ఓఎస్డి ప్రొఫెసర్ ఎస్. టేకి, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. పెర్సిస్, కోర్సు కోఆర్డినేటర్ లక్ష్మి అభినందించారు.