విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
మండలం వెదురుపాక గ్రామ దేవత పోలేరమ్మ జాతర లో ఎస్సీ కులానికి చెందిన విప్పర్తి మురళిని ఏ కారణం లేకుండా దళితుడు అనే వివక్షతో బీసీ కులానికి చెందిన దంగేటి బాలకృష్ణ, గుబ్బల దుర్గ ప్రసాద్, కంచి నగేష్, కంచి తిలక్, కుమార్ తదితరులు కులం పేరుతో దూషించి జుట్టు పట్టుకొని లాకుని వెళ్లి బంధించి కొట్టడం దారుణం అని ఇదంతా ఒక పథకం ప్రకారం దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు అని ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో ఎంపీడీవో ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లో జిల్లా మాల మహానాడు నాయకుడు కొండబాబు మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కూడా దేవుడి పేరుతో కులం పేరుతో దూషించి బీసీ కులస్థులు కూడా దళితుల మీద దాడి చేయడం ఎంతో దారుణం అని కొండబాబు అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన ప్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్ రావు,బత్తుల రమేష్, మరే మణి, కుక్కల శ్రీదర్, ఇంజిమల ప్రభాకరరావు, బాబీ, పుళ్ళయ, తదితరులు పాల్గొన్నారు