విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
జిల్లా విద్యాశాఖ మరియు వి బి వి ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వేసవి వినోదాన్ని జయప్రదం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిణి డి.సుభద్ర పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తన కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్నాధపురం, కాకినాడ నందు గల ఎంఎస్ఎన్ చారిటిస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల నందు జూన్ ఒకటి నుంచి 10వ వరకు విద్యార్థులకు నిర్వవహిస్తున్న వేసవి శిబిరంను జిల్లా విద్యాశాఖ,విబివిఆర్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఇది పూర్తిగా ఉచితం. ఏ పాఠశాలలో చదువుతున్న వారైన పాల్గొనవచ్చు.పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును. 9నుండి 14 సం.ల వయస్సు కల్గిన(5 నుండి 10వ తరగతి ) వారు పాల్గొన వచ్చునన్నారు.
*ఈ వేసవి వినోదంలో*
సైన్స్ ప్రయోగాలు, డ్రాయింగ్, గణితం, పప్పెట్రీ, కథలు, వ్యక్తిత్వ వికాసం అనే అంశాల్లో శిక్షణ ఇవ్వబడును. ఇతర వివరాలకు కేసరి శ్రీనివాసరావు 9912703697 నెంబరును సంప్రదించాలన్నారు.
ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పిల్లి గోవిందరాజులు, ఎంవిఎస్ రామకృష్ణ, కేసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.