GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):
గోకవరం: సత్యనారాయణస్వామి ఆలయంలో కొలువై ఉన్న కాలభైరవ స్వామికి అష్టమి తిథి సందర్భంగా గురువారం లోకకళ్యాణార్థం విశేష అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

