విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో మహేంద్రవాడ రోడ్డు వద్ద మదర్ థెరిస్సా యూత్ వారి ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ పి వి వి సురేష్, సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, వైస్ సర్పంచ్ బొడ్డు శ్రీను, జిల్లా బ్లడ్ డోనర్ అధ్యక్షులు వెలగల ఫణి కృష్ణారెడ్డి ఇరువురు పాల్గొని చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ పి వి వి సురేష్ మాట్లాడుతూ మదర్ థెరిస్సా యూత్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమైన అన్నారు. సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణికులు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ చలివేంద్రంని మదర్ థెరిస్సా యూత్ వారు ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. అనంతరం రోడ్డుమీద వెళ్ళే ప్రయాణికులకు యూత్ సభ్యులు మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో అండ్రా బసవరాజు, త్రిమూర్తులు, చంద్రమళ్ళ రత్నం, మదర్ థెరిస్సా యూత్ ప్రెసిడెంట్ చంద్రమళ్ళ సంజయ్ రాజ్, దువ్వ చంద్రశేఖర్, కందుకూరు గంగరాజు, చంద్రమళ్ళ రాజు, మధు, సురేంద్ర, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.