గోకవరం, East Godavari (VISWAM VOICE DESK):
గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా ఆస్పటల్ వాళ్ళు ఇక్కడ చెత్త వేస్తే 500 రూపాయలు జరిమాన అని ఫ్లెక్సీ పెట్టారు. కానీ ఏస్తే ఏమవుతుంది ఏం చేస్తారు అని కొంతమంది వ్యక్తులు చెత్తను తీసుకొచ్చి సరిగ్గా ఫ్లెక్సీ పెట్టిన చోటే చెత్త వేశారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల ప్రజలకు అంటురోగాలు ప్రబలతాయని ప్రభుత్వాలు చెప్పిన కొంతమంది మూర్ఖులు వాటిని పాటించడం లేదు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.

