Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లు పై సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లపై సమావేశం

 

కాకినాడ సిటీ,విశ్వం వాయిస్ న్యూస్ : ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) టెంప‌ర‌రీ క్యాంప‌స్‌ను 28వ తేదీ ఉద‌యం కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో కేంద్ర ఆర్థిక‌, కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో ఏర్పాట్ల‌కు సంబంధించి బుధ‌వారం ఐఐఎఫ్‌టీ ప్రాంగ‌ణంలో కాకినాడ ఎంపీ వంగా గీత, ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎస్‌.ఇల‌క్కియ‌, కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, ఐఐఎఫ్‌టీ సెంటర్ హెడ్ ప్రొఫెస‌ర్ వి.రవీంద్రసారధి, ఓఎస్‌డీ టి.బాబూరావు నాయుడు, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డా. ఎల్‌.సుమ‌ల‌త‌ త‌దిత‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. వివిధ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. స‌మావేశంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, మెప్మా పీడీ బి.ప్రియంవ‌ద‌, ఎల్‌డీఎం సీహెచ్ ఎస్‌వీ ప్ర‌సాద్‌, కాకినాడ అర్బ‌న్‌, రూర‌ల్ త‌హ‌సీల్దార్లు వైహెచ్ఎస్ స‌తీష్‌, మురార్జీ, పోలీస్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement