Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 5:34 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 5:34 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 5:34 PM
Follow Us

ప్రేమించి యువకుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ట్రాన్స్ జెండర్ సంఘాల ఆందోళన కు దళిత సంఘాలు మద్దతు…

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:

ప్రేమించి యువకుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య

– ఆందోళనకు దిగిన ట్రాన్స్ జెండర్ సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్

– ట్రాన్స్ జెండర్ సంఘాల ఆందోళన కు దళిత సంఘాలు మద్దతు…

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్ :

ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్థాపనతో ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించింది. రాజమహేంద్రవరం సింహాచలం దగ్గరకు చెందిన మిద్దె ప్రణీత (29)ను సింహాచల నగర్ ప్రాంతానికి చెందిన పట్టా శ్రీను అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలు కాలంగా ప్రేమిస్తున్నాడు. ప్రణితను వివాహం చేసుకుంటారని మోసం చేసి,ముఖం చాటు వేశాడు.దీనిపై ప్రణీత,శ్రీనును నిలదీయడంతో నాకు సంబంధం లేదు. నీ చావు నువ్వు చావు అని హేళన చేయడంతో మనస్తాపం చెందిన ప్రణీత ఈనెల 19వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపరస్మారక స్థితిలో ఉన్న ప్రణితను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించడం తో తాడితోటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది.ఈ సంఘటన తెలుసుకున్న ట్రాన్స్ జెండర్ సంఘాలు తాడితోటలోని ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు.ట్రాన్స్ జెండర్ మృతికి కారుకుడైన శ్రీను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.ఈ ఆందోళనకు దళిత సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.ఈ ఆందోళనలో ట్రాన్స్ జెండర్ సంఘ నాయకులు సోని,ఎస్ కే జరీనా,నందు,జ్యోతి,దళిత సంఘాల నాయకులు పాము బాబురావు, కోరుకొండ చిరంజీవి,తాళ్లూరి రాజేంద్రప్రసాద్, బుర్ర చిన్ని ,దారా ఏసురత్నం,వెంట్రపాటి వీర్రాజు,ఉసురుమర్తి రామారావు,ఎంపీడీ కృపావరం తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement