ఈ నెల 26 లోపు దరఖాస్తులు కళాశాలలో నమోదు చేసుకొనుటకు గడువు
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
_పదో తరగతి పాసైన తరువాత ఇంటర్మీడియట్లో చేరకుండా,ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో మానేసిన విద్యార్థులు కొరకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఏపీఓఏస్ఏస్ ద్వారా చదువుకునేందుకు అవకాశాలు కల్పించారని,ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని మండల కేంద్రమైన రావులపాలెం లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి. గోపాలకృష్ణ గురువారం తెలియజేశారు.ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తులను స్థానిక కళాశాల యందు అలాగే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమ దరఖాస్తును నమోదు చేసుకోని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు._