Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

భాష్యంలో ఘనంగా 8వ వార్షికోత్సవ వేడుకలు.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో భాష్యం పాఠశాలలో 8వ వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ గుప్త అధ్యక్షత శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మండల తాశీల్దారు కె.జే. ప్రకాష్ బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం విజేతలకు బహుమతులు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాశీల్దారు ప్రకాష్ బాబు మాట్లాడుతూ పిల్లలందరూ క్రమశిక్షణలో ఉండి, చదువుకుని మంచి భారత బావి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ గుప్త మాట్లుడుతూ భాష్యం విద్యాసంస్థల విద్యతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సర్వతోమఖాభివృద్ధికి కృషి చేస్తారని విద్యార్థులంతా అన్ని విభాగాల్లో ముందుండాలని తెలిపారు. ఈ సందర్భంగా వార్షిక పరీక్షలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆటపాటలతో సందడిగా గడిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాష్యం జోనల్ ఇన్చార్జ్ వి గోవిందరాజులు, వైస్ ప్రిన్సిపాల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ తెలుగు పండితులు వి. వెంకటేశ్వరరావు, ఫ్రెమరీ ప్రిన్సిపాల్ ఎమ్. కాంచన, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement