Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పార్డ్ ఇండియా కేంద్ర కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన పార్డ్ ఇండియా సంస్థ సమావేశం

విశ్వంవాయిస్ న్యూస్, దేవరపల్లి:

దేవరపల్లి:మండలంలోని యర్నగూడెం ప్రధాన కేంద్రంగా నున్న పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క నల్లజర్ల శాఖ కార్యాలయం నందు కేంద్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోవు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా దేవరపల్లి మరియు నల్లజర్ల మండలాలలోని హైస్కూళ్ళలో 8,9,10 తరగతి విద్యార్థులకు నైపుణ్యతతో కూడిన మండల స్థాయి పరీక్షలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయునున్నట్లు తెలియజేశారు.అదే విధంగా విద్యార్థులలో దేశభక్తి మరియు నైతిక విలువలు పెంపొందించే విధంగా స్థానిక కళాశాలల యందు దేశభక్తి గేయాలతో కూడిన అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు తెలియజేశారు.ఈ సందర్భంగా పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలకు ఆకర్షితులై అమెరికాకు చెందిన అడవి రాజేష్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 20,000 రూపాయలు విరాళంగా అందజేశారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్,నల్లజర్ల శాఖ అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ షరీఫ్,ఇతర కేంద్ర కమిటీ సభ్యులు దేవరాజు అచ్యుతరావు,వసంతాడ ఆనందస్వరూప్,సోమిశెట్టి వెంకటరావు,బొందల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement