Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

*మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి వైసీపీ దుష్ట పాలనకు.పరాకాష్ఠ…*

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

*మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి వైసీపీ దుష్ట పాలనకు.పరాకాష్ఠ…*
ఉబలంక గ్రామం లో ఇదేమి కర్మ -మన రాష్ట్రానికి కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యనందరావు

విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణ మని ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులపై వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమని దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి, పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చెయ్యడం అమానుషమని సత్యానందరావు మండిపడ్డారు. మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం నియంతృత్వ చర్యని టీడీపీ వర్గీయుల వాహనాలను తగలబెట్టి దాడులకు పాల్పడిన వైసీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి ప్రభుత్వాన్ని బండారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గుత్తుల పట్టాభి రామారావు, జంపన ఫణీంద్ర వర్మ, చిలుకూరు సతీష్, మల్లిడి శ్రీనివాసరెడ్డి, దండు విజయరామరాజు, చింత భాస్కర్ రెడ్డి, మేడపాటి గంగిరెడ్డి, మేడపాటి చిట్టి రెడ్డి, మేడపాటి కాసురెడ్డి, చింత శ్రీరాంరెడ్డి మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement