విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
ఈనెల 21,22 తేదీల్లో వెండర్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం
- – వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్ :భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు-అభివృద్ధి ఫెసిలిటేషన్ ఆఫీసు విశాఖపట్నం, దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మార్స్ ఎన్జీవో సంయుక్త ఆధ్వర్యంలో “వెండర్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు డీఐసిసిఐ అసిస్టెంట్ డైరెక్టర్ జి.వి.వి.నాయుడు,జోనల్ కోఆర్డినేటర్ ఆరుగు జార్జి బాబు తెలిపారు.వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని ప్రవేశం ఉచితమని తెలిపారు.అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ బ్యాంకుల లోన్ మేళా జరుగుతుందన్నారు.వివిధ రంగాల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారు. వివిధ పారిశ్రామిక ఉత్పత్తులు ప్రదర్శించడానికి ముందుగా స్టాల్స్ బుక్ చేసుకోవాలని తెలిపారు.ఇతర వివరాలకు తమ సెల్ నెంబర్లు 9437045079,9848857577 లో సంప్రదించవచ్చని నాయుడు,జార్జిబాబు తెలిపారు.