విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*విభిన్న ప్రతిభావంతులకు లాప్టాప్ లు అందించిన*
*జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర*
అమలాపురం డిసెంబర్ 19 విశ్వం వాయిస్
: రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ కోనసీమ జిల్లా నందు డిగ్రీ ఆపై ఉన్నత చదువులు అభ్యసించు చున్న ముగ్గురు దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర ముగ్గురు దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ 35,000 విలువచేసే హెచ్పి కంపెనీ లాప్టాప్ లను ఉచితంగా మంజూరు చేసి సోమవారం స్థానిక ఆయన చాoబర్ నందు విద్యార్థుల కు పంపిణీ చేశా రు. వీరు డిగ్రీ కళా శాలల ద్వారా బోనఫైడ్ సర్టిఫికెట్ పొంది ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ద్వారా ఈ వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ వారు మంజూరు చేసి ఉన్నారని, జిల్లా విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ సి ఆర్ ఓ వై శ్రీ రామ్ తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిం చుచున్నారని, ఒకరు హైదరాబాదులో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తున్నా రని ఆయన తెలిపారు రావులపా లెం డిగ్రీ కళాశాలలో జొన్నాడకు చెందిన ఆకుల సతీష్ ఎముకల సంబంధిత దివ్యాంగునికి ఒక లాప్టాప్ ను, మండపేటకు చెందిన చింతలపూడి పూర్ణచంద్రిక అనే అంధురాలకు ఒక లాప్టాప్ ను జొన్నాడకు చెంది హైదరాబాదులో విద్యాభ్యాసం చేస్తున్న పెన్నాడ వెంకట కిషోర్ అనే అందునికి మరొక లాప్టాప్ ను వెరసి మూడు లాప్టాప్ లను ఉచితంగా పంపిణీ చేశారన్నారు . ఈ కార్యక్రమంలో విభిన్న
ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ సి ఆర్ ఓ వై శ్రీ రామ్ తదితరులు పాల్గొన్నారు.