తమ షోరూంలో టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు, మొబైల్స్,లాప్టాప్, కిచెన్ వేర్, ఇతర గృహపకరణ పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు.
విశ్వంవాయిస్ న్యూస్, Rajamundribcity:
చారిత్రక రాజమహేంద్రవరంలో పై ఇంటర్నేషనల్ సంస్థ అడుగుపెట్టింది. గృహపకరణ రంగంలో అంతర్జాతయ స్థాయిలో పేరుగాంచిన పై ఇంటర్నేషనల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన 31వ షోరూంను రాజమహేంద్రవరం నగరంలో ఎంపీ మార్గాన్న భరత్ రామ్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించింది.తోలుతగా ఎంపీ మార్గాని భరత్ రామ్ షోరూం ను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ పై ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయంగా మంచి గుర్తింపును పొందిందని చెప్పారు. నాణ్యత కలిగిన గృహపుకర వస్తువులను వినియోగదారులకు అందించడం ద్వారా వినియోగదారుల మన్ననలను పొందడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఆ దిశగా యాజమాన్యం అడుగులు వేయాలని ఆకాంక్షించారు. పై ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పై రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 30 షోరూములు ద్వారా వినియోగదారులకు నాణ్యమైన గృహపకర వస్తువులను అందుబాటులోకి ఉంచుతున్నామని చెప్పారు.రాజమహేంద్రవరం నగరంలో తమ సంస్థ 31వ షోరూంను ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. నూతన సంవత్సర సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సంస్థ అనేక ఆఫర్లను ప్రవేశపెడుతుందని తెలిపారు. సుమారు 63 వేల 30 మందికి లక్కీ డిప్ ద్వారా బహుమతులను అందించునున్నామని చెప్పారు. తమ షోరూంలో టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు, మొబైల్స్,లాప్టాప్, కిచెన్ వేర్, ఇతర గృహపకరణ పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు.నూతన సంవత్సర సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు,అనంతరం లక్కీడిప్ ద్యారా విన్నర్లకు నగదు చెక్కులు రాజ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షోరూం హెడ్ సాయి,స్థానిక షో రూమ్ సేల్స్ మేనేజర్ కే సంజయ్ తదితరులు పాల్గొన్నారు.